• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

జహీరాబాద్ ఎంపీతో ముస్లిం నేతల భేటీ

SRD: జహీరాబాద్ ఎంపీ సురేష్ శెట్కార్‌ను శుక్రవారం హైదరాబాద్ లో TSIDC మాజీ చైర్మన్ మహమ్మద్ తన్వీర్, టీపీసీసీ సభ్యులు శ్రీనివాస్ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాజకీయ విశేషాలపై చర్చించారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సంసిద్ధం కావాలని ఎంపీ సూచించారు. ఇందులో ఉమ్మడి జిల్లా జడ్పీకో ఆప్షన్ మెంబర్ రషీద్, గౌసోద్దీన్ జావీద్, హాన్నన్, ఉన్నారు.

January 10, 2025 / 08:13 PM IST

అమీన్ పూర్ మున్సిపల్ సర్వసభ్య సమావేశం

SRD: అమీన్ పూర్ మున్సిపల్ సర్వసభ్య సమావేశం చైర్మన్ పాండురంగారెడ్డి అధ్యక్షతన శుక్రవారం నిర్వహించారు. వివిధ అభివృద్ధి పనుల కోసం 16.51 కోట్లతో సమావేశంలో ఆమోదం తెలిపినట్లు చైర్మన్ తెలిపారు. ఈ నిధులతో రోడ్లు, మురుగు కాల్వలు, ఇతర అభివృద్ధి పనులు చేపడతామని పేర్కొన్నారు. సమావేశంలో కమిషనర్ జ్యోతి రెడ్డి, వైస్ చైర్మన్ నరసింహ గౌడ్ పాల్గొన్నారు.

January 10, 2025 / 08:02 PM IST

లక్ష రూపాయల విలువగల టెంట్ హౌస్ సామాగ్రి అందజేత

MDK: జిన్నారం గ్రామ 8, 9వ, వార్డులోని మాల కుల సంఘానికి లక్ష రూపాయలతో టెంట్ హౌస్ సామాగ్రిని మాజీ సర్పంచ్ లావణ్య శ్రీనివాస్ రెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా సంఘం సభ్యులు నాయకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వెంకటేశం గౌడ్, భోజి రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, మంద రమేష్, నీలం మోహన్, బ్రహ్మేందర్ గౌడ్, నర్సింగ్ రావు, ఏర్పుల లింగం, మల్లేష్ ఉన్నారు.

January 10, 2025 / 07:05 PM IST

అప్పుల బాధతో ఆటో కార్మికుడి ఆత్మహత్య

MDK: అప్పుల బాధ భరించలేక మనస్తాపానికి గురై ఆటో కార్మికుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నంగునూరు మండలంలో జరిగింది. స్థానికుల వివరాలు.. మండల కేంద్రానికి చెందిన జంగిటి నరసింహులు (36) ఆటో డ్రైవర్గా జీవనం కొనసాగిస్తున్నాడు. రెండేళ్ల క్రితం సొంతింటి నిర్మాణం కోసం సుమారు 5 లక్షల వరకు అప్పు చేశాడు. ఈ క్రమంలో చేసిన అప్పు తీరకపోగా భాద భరించలేక చనిపోయాడు.

January 10, 2025 / 06:23 PM IST

కాటిరేవుల పండగను నిర్వహించుకోవడం అభినందనీయం: ఎమ్మెల్యే

SRCL: వేములవాడ పట్టణంలోని మహాలక్ష్మి వీధిలోని రేణుకా ఎల్లమ్మ వద్ద మహాలక్ష్మి రైతు మిత్ర సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన కాటిరేవుల మహోత్సవంలో ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రేణుకా ఎల్లమ్మ తల్లిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వారు మాట్లాడుతూ.. అనాదిగా వస్తున్న కాటిరేవుల పండగను నిర్వహించుకోవడం అభినందనీయమన్నారు.

January 10, 2025 / 06:20 PM IST

‘కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీ కోసం కష్టపడ్డ వారికి అవకాశం కల్పిస్తాం’

KNR: కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీ కోసం కష్టపడ్డ వారికి అవకాశాలు కల్పిస్తానని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మానకొండూ శాసనసభ్యుడు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ స్పష్టం చేశారు. తిమ్మాపూర్ మండలం కొత్తపల్లిలోని సాయిరాం గార్డెన్‌లో మండల పార్టీ అధ్యక్షుడు మోరపల్లి రమణారెడ్డి అధ్యక్షతన జరిగిన మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తల సమావేశంలో హాజరయ్యారు.

January 10, 2025 / 06:20 PM IST

అభివృద్ధి పనులు పరిశీలించిన మేయర్

KNR: రామచంద్రపురం కాలనీలో జరుగుతున్న డ్రైనేజీ సీసీ రోడ్డు పనులను శుక్రవారం నగర మేయర్ సునీల్ రావు, కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ పరిశీలించారు. అభివృద్ధి పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలని కాంట్రాక్టర్లకు సూచించారు. కాలనీలో ఏమైనా సమస్యలు ఉన్నా తమ దృష్టికి తీసుకురావాలని కాలనీవాసులకు తెలిపారు. వారి వెంట కార్పొరేటర్ జయశ్రీ వేణు, అధికారులు పాల్గొన్నారు.

January 10, 2025 / 05:57 PM IST

వాహనం ఢీకొని వృద్ధురాలు మృతి

MDK: నడుచుకుంటూ వెళ్తున్నా వృద్ధురాలిని గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటన మూసాయిపేట మండలంలో జరిగింది. స్థానికుల వివరాలు.. మృతురాలు మండలంలోని హక్కింపేట్ గ్రామానికి చెందిన పత్తి కృష్ణమ్మ (80) గా గుర్తించారు. మేడ్చల్లో ఉంటున్న తన కూతురు వద్దకు వెళుతున్న క్రమంలో సర్వీస్ రోడ్డులో గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో మృతి చెందింది.

January 10, 2025 / 05:51 PM IST

సీఎం సహాయనిధి చెక్కుల పంపిణీ

SRCL: ముస్తాబాద్ మండల అధ్యక్షులు ఏళ్ళ బాల్ రెడ్డి చేతుల మీదుగా శుక్రవారం సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ చేశారు. నిరుపేద కుటుంబాలకు కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని అందించి వారికి అండగా ఉండడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్య మని పేర్కొన్నారు. పేద ప్రజలకు ప్రజా ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉండి ఆదుకుంటుదన్నారు. ఈ కార్యక్రమంలో తదితర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

January 10, 2025 / 05:23 PM IST

లారీ ఢీకొని యువకుడి మృతి

KNR: కరీంనగర్-వరంగల్ జాతీయ రహదారిపై ఈదులగట్టపల్లి సమీపంలో గురువారం జరిగిన ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. మానకొండూర్ మండలం పెద్దూరుపల్లికి చెందిన శ్యామల, సంపత్ల పెద్ద కుమారుడు అజయ్ డిగ్రీ వరకు చదివి ఓ వాహన షోరూంలో పనిచేస్తున్నాడు. గురువారం కరీంనగర్‌కు ద్విచక్ర వాహనంపై వెళుతుండగా లారీ ఢీకొట్టింది. దీంతో అజయ్ అక్కడికక్కడే మృతిచెందాడు.

January 10, 2025 / 05:04 PM IST

మంత్రి ఉత్తమ్‌కు మాజీ మంత్రి కొప్పుల ఫోన్

JGL: ధర్మపురి గోదావరి పరివాహక ప్రాంతాల్లోని రైతుల సాగునీటి కష్టాల గురించి సంబంధిత మంత్రి ఉత్తం కుమార్ రెడ్డికి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఫోన్‌లో వివరించారు. సాగునీటి కోసం ధర్మపురి ప్రాంత రైతులు తీవ్ర కష్టాలను ఎదుర్కొంటున్నారని వివరించగా, మంత్రి సానుకూలంగా స్పందించి కలెక్టర్, సంబంధిత అధికారులు రివ్యూ నిర్వహిస్తామని హామీ ఇచ్చినట్లు ఆయన పేర్కొన్నారు.

January 10, 2025 / 04:31 PM IST

దుమాల గురుకుల పాఠశాలలో మెడికల్ క్యాంప్

ఖమ్మం: ఎల్లారెడ్డిపేట మండలం దుమాల గ్రామ శివారులోని ఉన్న ఏకలవ్య గురుకుల పాఠశాలలో సీహెచ్సీ వైద్య బృందం శుక్రవారం మెడికల్ క్యాంప్ నిర్వహించారు. సీహెచ్‌సీ వైద్యాధికారిణి సారియా అంజుమ్ 133 మంది విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం ఉచితంగా మందులు పంపిణీ చేశారు. 18 మంది విద్యార్థులకు రక్త పరీక్షల కోసం ఎల్లారెడ్డిపేట సీహెచ్సీ సెంటర్‌కు పంపించారు.

January 10, 2025 / 04:25 PM IST

ఈ నెల 11వ తేదీ పనిదినమే: డీఈవో

NRML: జిల్లాలోని కస్తూర్బా గాంధీ పాఠశాలలకు ఈనెల 12 నుంచి 17 వరకు సంక్రాంతి సెలవులు ఉంటాయని జిల్లా విద్యాశాఖ అధికారి రామారావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. వారు మాట్లాడుతూ.. ఈనెల 11 తేదీన కేజీబీవీ పాఠశాలలకు పని దినంగా ప్రకటించామని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు గమనించాలని కోరారు.

January 10, 2025 / 12:27 PM IST

బాధిత కుటుంబానికి ఎల్ఓసీ చెక్కు అందజేత

NRML: నిర్మల్ పట్టణం భాగ్యనగర్ కాలనీకి చెందిన చంద్రం ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా ఆపరేషన్ నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి రూ. 2 లక్షల 50 వేల ఎల్ఓసీ చెక్కును శుక్రవారం డీసీసీ అధ్యక్షుడు శ్రీహరి రావు బాధిత కుటుంబానికి అందజేశారు. మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్, మార్కెట్ కమిటీ చైర్మన్ భీమ్ రెడ్డి, కౌన్సిలర్ అన్వర్, రాము తదితరులు పాల్గొన్నారు.

January 10, 2025 / 12:25 PM IST

శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న మున్సిపల్ ఛైర్‌పర్సన్

సూర్యాపేట జిల్లా కేంద్రంలోని శ్రీవెంకటేశ్వర స్వామి దేవాలయంలో ముక్కోటి ఏకాదశి వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ ఛైర్‌పర్సన్ పెరుమాళ్ళ అన్నపూర్ణ శ్రీనివాస్ కుటుంబ సభ్యులు వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సూర్యాపేట పట్టణ ప్రజలంతా అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని కోరుకున్నానన్నారు

January 10, 2025 / 12:09 PM IST