• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

నేడు కరెంట్ కట్

MBNR: బాలానగర్ మండలంలోని మోతీ ఘనపూర్ సబ్ స్టేషన్ పరిధిలో మరమ్మతుల కారణంగా ఆదివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు విద్యుత్ సరఫరా నిలిచిపోతుందని ఏఈ చంద్రశేఖర్ శనివారం తెలిపారు. మోతీ ఘనపూర్ సబ్ స్టేషన్ పరిధిలోని గ్రామాల ప్రజలు ఈ విషయాన్ని గమనించాలన్నారు. ఆయా గ్రామాల ప్రజలు విద్యుత్ శాఖ సిబ్బందికి సహకరించాలని ఆయన కోరారు.

February 22, 2026 / 07:00 AM IST

నేడు గురుకుల ప్రవేశ పరీక్ష

భువనగిరిలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో 2026-27 విద్యా సంవత్సరానికి 5వ తరగతిలో అడ్మిషన్‌తో పాటు 6, 7, 8, 9వ తరగతులలో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి ఆదివారం ప్రవేశ పరీక్ష జరగనుంది. ఇందు కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష జరగనున్నట్లు అధికారులు వెల్లడించారు.

February 22, 2026 / 06:59 AM IST

హాజరుకానున్న 12,334 మంది విద్యార్థులు: డీఐఈవో

MDK: ఈనెల 25 నుంచి జరిగే ఇంటర్మీడియట్ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి మాధవి తెలిపారు. మొత్తం విద్యార్థులు-12,334, ఫస్ట్ ఇయర్ జనరల్-5710, ఫస్ట్ ఇయర్ ఒకేషనల్-599, మొత్తం-6309, సెకండ్ ఇయర్ జనరల్–5472, సెకండ్ ఇయర్ ఒకేషనల్-533, మొత్తం-6025, పరీక్ష కేంద్రాలు -28, ఫ్లైయింగ్ స్క్వాడ్-5 ఉన్నట్లు వెల్లడించారు.

February 22, 2026 / 06:58 AM IST

ఘనంగా కొనసాగుతున్న జ్యోతిర్లింగ శివాలయం ఉత్సవాలు

SRD: జిన్నారం మున్సిపల్ కేంద్రంలోని తాంబేలు గుట్టపై జ్యోతిర్లింగ శివాలయ ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శనివారం రాత్రి స్వామివారికి ప్రత్యేకంగా స్వలాలతో ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు వేద పండితులు తెలిపారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

February 22, 2026 / 06:55 AM IST

రోజు రోజుకు దిగజారుతున్న ప్రయాణికుల సౌకర్యం

BDK: పాల్వంచ RTC బస్ స్టాండ్‌లో ప్రయాణికుల సౌకర్యాలు రోజురోజుకు దిగజారుతున్నాయి. చెట్ల కింద ప్రయాణికులు కూర్చునేందుకు ఏర్పాటు చేసిన బెంచ్‌లను తొలగించి ఎండలో పడేయడంతో ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. ఎండాకాలంలో ప్రయాణికులు చెట్ల నీడలో వేచి ఉండే సౌకర్యం పూర్తిగా లేకుండా పోయింది. కనీసం టూ వీలర్ కార్లు ఆపడానికి కూడా సౌకర్యం లేదన్నారు.

February 22, 2026 / 06:47 AM IST

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే

వనపర్తి: ఘనపురం మండలం సోలిపురం గ్రామానికి చెందిన తరుణ్ అనే యువకుడు ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించాడు. విషయం తెలుసుకున్న వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి సోలిపురంలోని బాధిత కుటుంబాన్ని పరమర్శించారు. ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. అన్ని విధాలుగా కుటుంబాన్ని ఆదుకునే ప్రయత్నం చేస్తామని కుటుంబానికి భరోసా కల్పించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

February 22, 2026 / 06:46 AM IST

దొంగ వస్తువులు కొనుగోలు.. యజమాని అరెస్ట్

ADB: దొంగ వస్తువులు కొనుగోలు చేసిన ముజాహిద్ అనే స్క్రాప్ దుకాణ యజమానిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు బోథ్ CI గురుస్వామి నిన్న తెలిపారు. దిగ్నూర్ గ్రామానికి చెందిన కొరెల్లి రామకృష్ణ అనే వ్యక్తి బోర్‌వెల్ పైపులను దొంగలించి ముజాహిద్‌కు అమ్మినట్లు వెల్లడించారు. పంచాయతీ కార్యదర్శి స్వామి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఆయన పేర్కొన్నారు.

February 22, 2026 / 06:37 AM IST

ఉపకార వేతనాలకు దరఖాస్తుల ఆహ్వానం

SRCL: జిల్లాలోని 1-10 తరగతి దివ్యాంగ విద్యార్థుల నుంచి ఉపకార వేతనాల కోసం దరఖాస్తులు కోరుతున్నట్లు జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మీరాజం తెలిపారు. 40 శాతానికి పైగా వైకల్యం ఉండి, కుటుంబ వార్షిక ఆదాయం రూ. లక్ష లోపు ఉన్నవారు అర్హులు. ఆసక్తి గల విద్యార్థులు ఈనెల 28వ తేదీలోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుని అనంతరం దరఖాస్తు పత్రాలను కలెక్టరేట్‌లో సమర్పించాలన్నారు.

February 22, 2026 / 06:33 AM IST

బైక్‌ను ఢీ కొన్న ట్రాక్టర్.. ఇద్దరకి తీవ్ర గాయాలు

MNCL: మందమర్రి పట్టణం పులిమడుగు వద్ద శనివారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. కర్ర లోడుతో రాంగ్ రూట్‌లో వస్తున్న ట్రాక్టర్ ఎదురుగా వస్తున్న బైక్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్‌పై ఉన్న ఇద్దరు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ట్రాక్టర్ డ్రైవర్ అజాగ్రత్త వల్లే ప్రమాదం జరిగిందన్నారు.

February 22, 2026 / 06:32 AM IST

‘బిల్లును సకాలంలో చెల్లించి సహకరించాలి’

WGL: రాయపర్తి మండలం మైలారం సబ్‌స్టేషన్ పరిధిలోని వినియోగదారులు తమ విద్యుత్ బిల్లులను సకాలంలో చెల్లించి సహకరించాలని సబ్ ఇంజనీర్ సయ్యద్ ముజాఫర్ అహ్మద్ కోరారు. ఆదివారం మైలారం గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ప్రత్యేక బిల్లుల సేకరణ కేంద్రం ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.

February 22, 2026 / 06:30 AM IST

మాస్టర్ మైండ్ 5వ వార్షికోత్సవంలో పాల్గొన్న మాజీ మేయర్

RR: మహేశ్వరం నియోజకవర్గంలోని జీహెచ్ఎంసీ పరిధిలో గల బడంగ్‌పేట్ డివిజన్‌లో ది మాస్టర్ మైండ్ స్కూల్ 5వ వార్షికోత్సవ కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి మాజీ మేయర్ చిగిరింత పారిజాత నరసింహారెడ్డి పాల్గొన్నారు. మాజీ మేయర్ మాట్లాడుతూ.. ఈ విద్యాసంస్థలు అంచలంచలుగా ఎదిగి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని అన్నారు.

February 22, 2026 / 06:30 AM IST

విధులకు రాకుండానే సంతకాలు..!

SRPT: నూతనకల్ మండలం పెద్దనేమిల గ్రామంలోని అంగన్‌వాడీ కేంద్రం-2లోని సదరు టీచర్ 19న సెలవులో ఉండి కూడా హాజరు పట్టీలో సంతకం చేశారని, 21న ఎటువంటి సమాచారం లేకుండా విధులకు గైర్హాజరయ్యారని గ్రామస్థులు ఆరోపించారు. పిల్లల రక్షణ ప్రశ్నార్థకంగా మారిందని, బాధ్యత రహితంగా వ్యవహారిస్తున్న టీచర్‌పై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

February 22, 2026 / 06:29 AM IST

డిప్యూటీ సీఎం పర్యటన వాయిదా

SRCL: జిల్లాలో ఈరోజు ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పర్యటన వాయిదా పడింది. గంభీరావుపేట మండలంలో వివిధ అభివృద్ధి పనులకు ఆయన హాజరుకావాల్సి ఉండగా, అనివార్య కారణాల వల్ల ప్రోగ్రాం రద్దయినట్లు డిప్యూటీ సీఎం ప్రైవేట్ సెక్రటరీ ప్రకటించారు. పర్యటనకు సంబంధించిన తదుపరి తేదీని త్వరలోనే వెల్లడిస్తామని అధికారులు తెలిపారు.

February 22, 2026 / 06:28 AM IST

‘సీఎం-కప్’ పోటీల్లో జిల్లా వాసికి బంగారు పతకం

NRPT: హైదరాబాద్లో జరిగిన రాష్ట్ర స్థాయి సీఎం కప్ పోటీల్లో నారాయణపేటకు చెందిన విద్యాశ్రీ రోయింగ్ విభాగంలో బంగారు పతకం సాధించిందని జిల్లా క్రీడల శాఖ అధికారి వెంకటేశ్ తెలిపారు. అండర్-16 షాట్ పుట్ పోటీల్లో నర్మదా కాంస్య పతకం గెలుపొందిందన్నారు. ఇద్దరు క్రీడాకారులు రాష్ట్ర స్థాయిలో పథకాలు సాధించడం గర్వకారణమని, మునుముందు అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని సూచించారు.

February 22, 2026 / 06:24 AM IST

‘ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం వేగవంతం చేయాలి’

NLG: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని హౌసింగ్ బోర్డు పీడీ ఎస్పీ రాజ్ కుమార్ అన్నారు. శనివారం కట్టంగూర్ మండల కేంద్రంలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ గృహాల పనుల పురోగతిని పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. మార్చి చివరి నాటికి ఇళ్ల నిర్మాణం పూర్తి చేసే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు.

February 22, 2026 / 06:24 AM IST