NZB: కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ బీజేపీ కార్యకర్తలు నిజామాబాద్ కలెక్టరేట్ ముట్టడికి పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో పోలీసులు ముందస్తు అరెస్టులు చేశారు. బోధన్, సాలూర మండలాల బీజేపీ అధ్యక్షులు సిర్పా సుదర్శన్, రావుబా గంగాధర్లను సోమవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆరు గ్యారెంటీల అమలులో ప్రభుత్వం కాలయాపన చేస్తోందన్నారు.