MHBD: కురవి మండల కేంద్రంలోని గుడి పరిసరాల్లో ఉన్న పలు లాడ్జీలను ఎస్సై గండ్రాతి సతీష్ ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి తనిఖీలు చేపట్టారు. తాళలు వేసిన గదులు, గదుల్లో ఉన్న వ్యక్తుల ఆధార్ కార్డులు, రికార్డులో ఉన్న వాళ్ళ పేర్లను పరిశీలించారు. లాడ్జిలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.