NLG: అసెంబ్లీ ముట్టడి పిలుపు నేపథ్యంలో ఎంజీయూ విద్యార్థి నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. అరెస్టు అయిన వారిలో ఎస్ఎఫ్ఎ కార్యదర్శి రవికుమార్, పీడీఎస్యూ ఎంజీయూ అధ్యక్షుడు హర్షవర్ధన్, వినోద్ తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా విద్యార్థి నాయకులు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.