KNR: చిగురుమామిడి మండలం ముల్కనూర్ గ్రామంలో గర్భిణీలకు పౌష్టికహారం ప్రాముఖ్యతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ సూపర్వైజర్ సుల్తానా, ప్రణీత గర్భిణీలు తీసుకోవలసిన సమతుల్య ఆహారం, పోషకాహారం,నియమిత ఆరోగ్య పరీక్షల అవసరం, మాత, శిశువు ఆరోగ్య సంరక్షణపై వివరించారు. ఈ సందర్భంగా సర్పంచ్ భారతమ్మ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.