WNP: శ్రీరంగాపూర్ మండల కేంద్రంలో ఇటీవలే పాముకాటుతో మరణించిన మిత్రురాలి కుటుంబానికి 2006-2007 టెన్త్ బ్యాచ్ స్నేహితులు అండగా నిలిచారు. ఆ కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని తెలుసుకుని, మానవతా దృక్పథంతో శుక్రవారం రూ.30 వేల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. కష్టకాలంలో స్నేహితురాలి కుటుంబానికి అండగా నిలిచిన మిత్రులందరినీ మండల ప్రజలు అభినందించారు.
NRML: సోన్ మండలం జాఫ్రాపూర్ గ్రామంలో రూ.52 లక్షలతో పలు అభివృద్ధి పనులకు శుక్రవారం రాత్రి MLA మహేశ్వర్ రెడ్డి భూమి పూజ చేశారు. రూ.20 లక్షలతో భవనాలు, రూ. 20 లక్షలతో రెండు S.H.G వర్కింగ్ షెడ్ నిర్మాణానికి, రూ.12 లక్షలతో అంగన్వాడీ భవన నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బర్ల రాజారెడ్డి, మండల నాయకులు పాల్గొన్నారు.
KNR: గంగాధర మండలం కురిక్యాల గ్రామంలో శుక్రవారం జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి ఉప్పులు శ్రీధర్ MGNREGS పని ప్రదేశాన్ని పరిశీలించారు. గ్రామంలోని పాత చెరువు చేపల కుంట పని 65 మంది కూలీలతో జరుగుతుండగా వారితో ఆయన మాట్లాడారు. కొత్తగా అమలులోకి వచ్చిన ఈకేవైసీ ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్ ద్వారా కూలీల హాజరు స్థితిని పరిశీలించారు.
JGL: జిల్లాలో సరిపడా వంట గ్యాస్ సిలిండర్లు ఉన్నాయని, ఎలాంటి ఇబ్బందులు లేవని జిల్లా అదనపు కలెక్టర్ బిఎస్ లత అన్నారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో శుక్రవారం సాయంత్రం జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ అధ్యక్షతన గ్యాస్ ఏజెన్సీ యాజమానులు, సేల్స్ ఆఫీసర్లు, జిల్లా తహాసీల్దార్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. వంట గ్యాస్ సిలిండర్లను అక్రమంగా నిల్వ ఉంచకుండా చర్యలు తీసుకోవలన్నారు.
ADB: పదో తరగతి వార్షిక పరీక్షలను అత్యంత పారదర్శకంగా, పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఆదిలాబాద్ కలెక్టరేట్ నుంచి అధికారులకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పలు సూచనలు జారీ చేశారు. విద్యార్థులు పరీక్షా కేంద్రానికి నిర్ణీత సమయం కంటే ముందే చేరుకునేలా చూసుకోవాలని, నిమిషం ఆలస్యమైనా అనుమతించడం జరగదని స్పష్టం చేశారు.
MNCL: క్యాతనపల్లి మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో గత నెల 17న జరిగిన మంత్రి వివేక్ వెంకటస్వామి కాన్వాయ్ పై జరిగిన దాడిలో అరెస్టయిన BRS నాయకులు బండారి సూరిబాబు, మేడిపల్లి సంపత్, ఎండి ముస్తఫా ఆదిలాబాద్ జైలు నుంచి శుక్రవారం విడుదలయ్యారు. అన్యాయంగా తమపై కేసులు నమోదు చేయడం జరిగిందని పేర్కొన్నారు. మంత్రి వివేక్కు ప్రజలు తగిన బుద్ది చెబుతారని హెచ్చరించారు.
NGKL: అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ నేడు బల్మూరు మండలం కొండారెడ్డిపల్లి గ్రామంలో పర్యటించనున్నారు. ఉదయం 9 గంటలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన సోలార్ ప్యానెల్ ఏర్పాటు కార్యక్రమాన్ని ఆయన లాంచనంగా ప్రారంభించనున్నారు. ప్రతి ఇంటికీ సోలార్ విద్యుత్ అందించే లక్ష్యంతో అధికారులు ఈ ప్రణాళికను సిద్ధం చేశారు.
GDWL: అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల వేతనాన్ని రూ.18,000కు పెంచాలని కోరుతూ అలంపూర్ ఎమ్మెల్యే విజయుడుకు వినతిపత్రం అందజేశారు. ఐసీడీఎస్కు నిధులు కేటాయించాలని, ప్రీ-ప్రైమరీ విద్యను అంగన్వాడీల్లోనే కొనసాగించాలని కోరారు. దీనిపై ఎమ్మెల్యే సానుకూలంగా స్పందిస్తూ, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
MDK: శివంపేట మండలం ఉసిరికపల్లి గ్రామ శివారులో శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో భర్త మృతిచెందగా భార్యకు తీవ్ర గాయాలయ్యాయి. పంబ గ్రామానికి చెందిన కమ్మరి నాగరాజు భర్యతో కలిసి బైక్ వెళ్తుండగా అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో నాగరాజు అక్కడికక్కడే మృతి చెందగా.. ఆయన భార్య అంజమ్మకు తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించారు.
SRPT: మోతే మండలం మామిల్లగూడెం గ్రామ సమీపంలో రెండు రోజుల క్రితం జరిగిన బైక్ ప్రమాదంలో గాయపడిన కోటయ్య చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మృతి చెందాడు. ప్రమాదం జరిగిన వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించినప్పటికీ పరిస్థితి విషమించడంతో ప్రాణాలు కోల్పోయారు. కోటయ్య మృతితో తుమ్మలపల్లి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
SRD: మన్నాపూర్ ప్రాథమిక పాఠశాలను జిల్లా అధికారుల బృందం తనిఖీ చేసింది. పాఠశాల రికార్డులు, ఎఫ్ఎల్ఎన్, ఎఫ్ఎల్ఎస్ కార్యక్రమాలు, ఉపాధ్యాయుల బోధన విధానాన్ని పరిశీలించారు. పాఠశాల పనితీరుపై అధికారులు సంతృప్తి వ్యక్తం చేశారు. స్వయం పాలన దినోత్సవంలో విద్యార్థులు ఉపాధ్యాయుల పాత్రలు పోషించి ఆకట్టుకున్నారు. జిల్లా నోడల్ అధికారి ప్రదీప్ కుమార్, అధికారులు వహబోద్దీన్, తదితరులు పాల్గొన్నారు.
KMR: జిల్లాలో పదో తరగతి పరీక్షల నిర్వహణకు సర్వం సిద్ధం చేసినట్లు కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తెలిపారు. శుక్రవారం ఎస్పీ రాజేష్ చంద్ర, సబ్ కలెక్టర్లు విక్టర్, మధుమోహన్తో కలిసి ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. జిల్లాలోని 65 పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు వివరిచారు.
సూర్యాపేట జిల్లాలో గ్యాస్ సరఫరాలో అక్రమాలను అరికట్టేందుకు ప్రభుత్వం జిల్లా స్థాయి మానిటరింగ్ కమిటీని ఏర్పాటు చేసింది. జిల్లా కలెక్టర్ ఛైర్మన్గా, పౌరసరఫరాల అధికారి కన్వీనర్గా ఉండే ఈ కమిటీ గ్యాస్ నిల్వలను రోజు పర్యవేక్షిస్తుంది. సిలిండర్ల బ్లాక్ మార్కెట్, దారిమళ్లింపులో బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని అధికారులు తెలిపారు.
SRCL: ప్రజా పాలన – ప్రగతి నివేదికలో భాగంగా గంభీరావుపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 3రోజుల పాటు అంతర్గత నాణ్యత అకాడమిక్ ఆడిట్ నిర్వహించారు. ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ వి. విజయలక్ష్మి ఆధ్వర్యంలో డా. ఎం. ప్రభాకర్, డా. వై. ఆంజనేయులు విభాగాల రికార్డులను పరిశీలించి సూచనలు అందించారు. అకాడమిక్, రీసెర్చ్, ఔట్రీచ్ కార్యకలాపాలను ఆధారాలతో నమోదు చేసి ఐక్యూ ఏసీకి సమర్పించాం అన్నారు.
PDPL: పెద్దపల్లి మండలం రంగాపూర్లో రూ.20 లక్షలతో అంతర్గత సీసీ రోడ్లు, సైడ్ డ్రైన్ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు శుక్రవారం సాయంత్రం శంకుస్థాపన చేశారు. ప్రభుత్వం అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తోందని, నియోజకవర్గ అభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తోందని అన్నారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.