NZB: ప్రభుత్వ పాఠశాలలు, ఐ.టీ.ఐలలో కొనసాగుతున్న అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లను కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. చందూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలతో పాటు, అదే ఆవరణలో కొనసాగుతున్న ప్రాథమిక పాఠశాలలను కలెక్టర్ సందర్శించారు. మెనూ ప్రకారం పౌష్టికాహారంతో కూడిన భోజనం అందించాలని సూచించారు.
ADB: మావల మండలంలోని శ్రీనగర్ కాలనీకి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు విజయ్ కుమార్ ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన గురువారం చోటుచేసుకుంది. ఈయన బజార్హత్నూర్ మండలంలోని వర్తమానూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తెలుగు స్కూల్ అసిస్టెంట్ ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు.
NGKL: మాతా శిశు మరణాలు అరికట్టడంలో ప్రతి ఒక్కరు తోడ్పాటు అందించాలని వైద్యాధికారి ప్రసన్న అన్నారు. గురువారం బిజినేపల్లి మండలం లట్టుపల్లి PHCలో గర్భిణీలకు మాతృత్వ సంరక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యాధికారి మాట్లాడుతూ.. నమోదు చేసుకున్న ప్రతి గర్భిణీ మహిళలకు ఆరోగ్య, ఆశ కార్యకర్తలు క్షేత్రస్థాయిలో మాతృత్వ సంరక్షణ సేవలు తప్పనిసరిగా అందించాలని సూచించారు.
NLG: అడ్డగూడూరు(M) కోటమర్తి MPP పాఠశాల విద్యార్థులు నిత్యం కోతుల బెడదతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తరచూ విద్యార్థులు భోజనం చేసే సమయంలో కోతులు విరుచుకుపడుతూ.. దాడులు చేస్తున్నాయి. ఈ సమస్యను ఎదుర్కోవడానికి విద్యార్థులు ఇవాళ చింపాంజీ, సింహం ఆకారంలో ఉన్న మాస్కులు ధరించి, కోతులను తరిమేందుకు వినూత్నంగా యత్నించారు. నియంత్రణకు అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.
HYD: లాలాగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో మౌలిక అనే 20 ఏళ్ల యువతి గురువారం ఆత్మహత్య చేసుకుంది. తార్నాక రైల్వే డిగ్రీ కళాశాలలో చదువుతున్న ఈ యువతి, మాణికేశవ్ నగర్ కు చెందిన అంబాజీ నాయక్ అనే యువకుడి వేధింపులు భరించలేక ఈ దారుణానికి పాల్పడిందని ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఘటనపై లాలాగూడ పోలీసులు పూర్తి వివరాలను సేకరిస్తున్నారు.
WNP: శ్రీరంగాపురం మండలంలో గురువారం జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు నామినేషన్ల ప్రక్రియ ఉన్నందున, మండల ప్రజా పరిషత్ కార్యాలయం వద్ద 144 సెక్షన్ అమలు చేసినట్లు ఎస్సై హిమబిందు తెలిపారు. ఎన్నికల సంఘం సూచనల మేరకు, నామినేషన్ కేంద్రాల నుంచి 100 మీటర్ల పరిధిలో ఈ సెక్షన్ అమల్లో ఉంటుందని ఆమె చెప్పారు.
NRML: పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా సేవలు మరువలేనివని నిర్మల్ టాటా ఇన్సూరెన్స్ సభ్యులు పేర్కొన్నారు.గురువారం జిల్లా కేంద్రంలో రతన్ టాటా ప్రథమ వర్ధంతి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక సాగర్ కాలనీలో గల డవ్ వృద్ధాశ్రమంలోని వయోవృద్ధులకు దుప్పట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టాటా ఇన్సూరెన్స్ సిబ్బంది పాల్గొన్నారు.
MBNR: జడ్చర్ల మండలం బాదేపల్లిలోని ప్రభుత్వ బాలుర పాఠశాలలో అక్షయ పాత్ర భోజనంలో ఈరోజు తాడి జెర్రీ వచ్చిందని, విద్యార్థులు అన్నం తినకుండా పడేశారని DYFI జిల్లా కన్వీనర్ ప్రశాంత్ అన్నారు. ఈ సందర్భ్ంగా ఆయన మాట్లాడుతూ.. మధ్యాహ్నం విద్యార్థులు తినేటప్పుడు అన్నంలో పురుగులు రావడంతో ఇబ్బంది పడుతూ తమకు విషయం చెప్పారని తెలిపారు.
BHPL: చిట్యాల మండలం నైన్పాక గ్రామానికి పరకాల RTC డిపో బస్సు రాత్రి 8 గంటలకు బయలుదేరి 10 గంటలకు చేరుకునేది, ఉదయం 5 గంటలకు తిరిగి పరకాలకు వెళ్ళేది. ఈ మధ్య కాలంలో సర్వీసు నిలిపివేయడంతో జడల్పేట, నైన్పాక గ్రామాలకు ప్రయాణించే వ్యవసాయదారులు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బస్సు సర్వీసును తిరిగి పునరుద్ధరించాలని గ్రామస్థులు అధికారులను కోరుతున్నారు.
MDK: స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ సజావుగా జరగాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పేర్కొన్నారు. హవేలి ఘనపూర్ ఎంపీడీవో కార్యాలయంలో నామినేషన్ల ప్రక్రియను పరిశీలించారు. నామినేషన్ల స్వీకరణ సమయంలో ఆర్ఓ, ఏఆర్వోలు నామినేషన్లు క్షుణ్ణంగా పరిశీలించాలని కలెక్టర్ వివరించారు. ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలని కలెక్టర్ సూచించారు.
NZB: తపాలా శాఖ అందిస్తున్న వివిధ పథకాల గురించి భీమ్గల్ సబ్ పోస్ట్ మాస్టర్ ప్రదీప్ వివరించారు. అంతర్జాతీయ తపాలా దినోత్సవం సందర్భంగా మాట్లాడుతూ.. ప్రజలకు తపాల శాఖ అందిస్తున్న పథకాలపై అవగాహన కల్పించడానికి వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. సుకన్య సమృద్ధి యోజన, PPF, సీనియర్ సిటిజెన్,ఇన్సూరెన్స్,సేవింగ్స్, ఫిక్స్డ్ డిపాజిట్ పథకాలు అందుబాటులో ఉన్నాయన్నారు.
HYD: దీపావళి సందర్భంగా సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో తాత్కాలికంగా బాణసంచా విక్రయించేందుకు లైసెన్స్ కోరే అభ్యర్థులకు సంబంధిత జోన్ డీసీపీ లైసెన్స్ జారీ చేస్తారని సీపీ అవినాష్ మహంతి ప్రకటించారు. లైసెన్స్ కోసం 16 అక్టోబర్ 2025లోపు www.cyberabadpolice.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు.
MDK: చేగుంట మండలం పోలంపల్లికి చెందిన కొండి లక్ష్మీ కుటుంబానికి భూమి కేటాయించాలని మాల మహానాడు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొండి స్వామి డిమాండ్ చేశారు. తహసీల్దార్ శివప్రసాద్కు కొండి లక్ష్మీ భర్త అంజయ్యతో కలిసి వినతిపత్రం అందజేశారు. పంచాయతీ కార్యదర్శి వేధింపులతో లక్ష్మి మృతి చెందినట్లు తెలిపారు. అధికారుల హామీ మేరకు భూమి కేటాయించాలన్నారు.
KMR: గాంధారి మండలం లోని పెట్ సంగెం గ్రామంలోని ZPHS పాఠశాల క్రీడా మైదానంలో నేడు ఎస్జీఫ్ పాఠశాల విదార్థులకు వాలీబాల్ పోటీల ఎంపిక నిర్వహించినట్లు వ్యాయామ ఉపాధ్యాయుడు లక్ష్మణ్ రాథోడ్ తెలిపారు. గాంధారి,ఎల్లారెడ్డి, నాగిరెడ్డిపెట్ మండలాలకు చెందిన అండర్ 14 &17 బాలా బాలికలకు జిల్లాస్థాయికి వెళ్లేందుకు ఈ ఎంపికలు నిర్వహించినట్లు ఆయన తెలిపారు.
NLG: మెడికల్ ఎంట్రన్స్ పరీక్షలలో అర్హత సాధించిన దేవరకొండ మండలం ధర్మతండాకు చెందిన మూడవత్ శిరీష, మూడవత్ మేఘన లను బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ గురువారం అభినందించారు. అనంతరం వారిని శాలువాతో ఘనంగా సత్కరించారు. విద్యార్థినులు ఉన్నత విద్యలో రాణించాలని కోరారు. విద్యార్థులకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.