NZB: ఎవరైనా కృత్రిమ కొరతను సృష్టించి బ్లాక్ మార్కెట్లో గ్యాస్ సిలిండర్లను విక్రయిస్తే నిత్యావసర సరకుల చట్టం-1955 ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని NZB కలెక్టర్ ఇలా త్రిపాఠి శుక్రవారం హెచ్చరించారు. జిల్లాలో 5,81,769 గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయని, 33 గ్యాస్ ఏజెన్సీల ద్వారా సరఫరా జరుగుతోందని, 10,850 సిలిండర్లు జిల్లాలో గృహావసరాల కోసం అందుబాటులో ఉన్నాయన్నారు.
KNR: విద్యార్థులు ఒత్తిడికి లోనవకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయాలని, 10వ తరగతి విద్యార్థులకు చొప్పదండి మండల విద్యాధికారి పి. మోహన్ సూచించారు. ఈనెల 14 నుంచి ఏప్రిల్ 16 వరకు జరగబోయే పదవ తరగతి వార్షిక పరీక్షలకు మండలంలో 3 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామని, పరీక్షలకు సర్వం సిద్ధం చేసినట్లు, 237 మంది బాలురు, 296 మంది బాలికలు మొత్తం, 533 రాస్తున్నారని తెలిపారు.
WNP: పోలీసు సిబ్బంది సంక్షేమం, ఆరోగ్యం, పిల్లల విద్య పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపడం ద్వారా మాత్రమే పోలీస్ శాఖ మరింత బలపడుతుందని జిల్లా ఎస్పీ సునీత రెడ్డి తెలిపారు. శుక్రవారం వనపర్తి జిల్లా పోలీస్ కార్యాలయంలో సాయిధ దళ పోలీసు సిబ్బందితో సమీక్షించారు. ఆమె మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణలో, ఎన్నికల సమయంలో సాయిధ దళ పోలీసు సేవలు అత్యంత కీలకమని తెలిపారు.
NZB: అవకాశం దొరికితే మళ్లీ మళ్లీ ఇందూరు తిరుమలకు వస్తానని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. శుక్రవారం ఆమె మోపాల్ మండలం నర్సింగ్ పల్లిలోని ఇందూరు తిరుమల క్షేత్రంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో పాల్గొని మాట్లాడారు. ఆలయం నేపథ్యం తెలుసుకొని తాను సంభ్రమాశ్చర్యాలకు గురి అయ్యానన్నారు. స్వామి వారి కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు.
GDWL: ప్రపంచ వినియోగదారుల దినోత్సవం సందర్భంగా శుక్రవారం మదనపల్లిలో జిల్లా న్యాయ సేవా సంస్థ అవగాహన కార్యక్రమం నిర్వహించింది. ప్రతి వినియోగదారుడు వస్తువులు, సేవల విషయంలో అప్రమత్తంగా ఉండాలని ప్రతినిధులు సూచించారు. ఏ వస్తువు కొన్నా ఖచ్చితంగా బిల్ తీసుకోవాలని, మోసపోతే న్యాయపరంగా పోరాడాలని పిలుపునిచ్చారు.
PDPL: పౌరసరఫరాల శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు ఇవాళ గోదావరిఖని పట్టణంలోని 7 హోటల్స్ను తనిఖీ చేసినట్లు అదనపు కలెక్టర్ వేణు ఒక ప్రకటనలో తెలిపారు. గృహ అవసరాలకు వినియోగించే గ్యాస్ సిలిండర్లను వాణిజ్య అవసరాలకు ఉపయోగిస్తుండడంతో 19 సిలిండర్స్ సీజ్ చేసి, 7 హోటల్స్పై కేసులు నమోదు చేశామని తెలిపారు.
BHPL: పూర్తి చేయాల్సిన అభివృద్ధి పనులకు డెడ్లైన్ పెట్టాలని, గడువు ముగిసినా పూర్తి కాకపోతే అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ చేసి శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని IT మంత్రి శ్రీధర్ బాబు ఆదేశించారు. శుక్రవారం మహదేవపూర్ మండలంలో పలు అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, కాంగ్రెస్ నేతలు ఉన్నారు.
SRD: కంగ్టి మండలం తడ్కల్లో శుక్రవారం సాయంత్రం సర్పంచ్ ఎలిచల సుగుణ మల్లారెడ్డి ఆధ్వర్యంలో ముస్లిం సోదరుల కోసం ఏర్పాటు చేసిన దావత్- ఏ – ఇఫ్తార్ విందులో డీసీసీ ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మానవతా విలువలతో మనిషి మహోన్నతుడిగా మారాలన్నదే ఉపవాసాల ముఖ్యోద్దేశ్యమని ఆయన అన్నారు.
సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ముందు గ్రామపంచాయతీ కార్మికులు శుక్రవారం ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఎల్లారెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రతి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ముందు ధర్నా చేసి వేది పత్రాలు అందిస్తున్నామన్నారు. గ్రామపంచాయతీ కార్మికులకు కనీస వేతనం రూ. 26,000 చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు.
SDPT: హుస్నాబాద్ జ్యోతి నగర్ వద్ద శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తల్లీకొడుకులు తీవ్రంగా గాయపడ్డారు. వెనుక నుంచి అతివేగంగా వచ్చిన కారు బైక్ను ఢీకొనడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో మండల మహేష్, తన తల్లి సారవ్వకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను హుస్నాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని స్థానికులు చెబుతున్నారు.
SRPT: కోదాడలో కల్తీ వంటనూనె తరలిస్తున్నారన్న ఫిర్యాదుతో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈరోజు కోదాడలో పోలీసుల సహకారంతో ట్యాంకర్, ఆటోను తనిఖీ చేసి రైస్ బ్రాన్ ఆయిల్ నమూనాలను సేకరించి హైదరాబాద్లోని స్టేట్ ఫుడ్ ల్యాబ్కు పంపారు. నివేదికలో కల్తీ అని తేలితే బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని అధికారులు హెచ్చరించారు.
KNR: శంకరపట్నం మండలం మొలంగూర్ ఎక్స్ రోడ్ వద్ద లారీ–బైక్ ఢీకొనడంతో మెట్టుపల్లి గ్రామంకు చెందిన ఇద్దరు యువకులు గాయపడ్డారు. అంతడుపుల నరేష్ తలకు తీవ్ర గాయం కాగా, వంగల సంపత్ రెడ్డి కాలు విరిగింది. స్థానికుల సమాచారం మేరకు 108 సిబ్బంది గాయపడిన వారిని హుజురాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
JGL: జిల్లాలో పదో తరగతి పబ్లిక్ పరీక్షల నేపథ్యంలో పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 144 అమలు చేయనున్నట్లు ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. మార్చి 14 నుంచి ఏప్రిల్ 16 వరకు ఉదయం 8:30 నుంచి మధ్యాహ్నం 1:30 వరకు పరీక్ష కేంద్రాల 200 మీటర్ల పరిధిలో గుంపులు, సభలు, ర్యాలీలు నిషేధం ఉంటుందని వెల్లడించారు.
SRPT: మోతే మండలం మామిళ్ళగూడెం గ్రామ శివారులోని చెరువులో ఓ వ్యక్తి ఈరోజు ప్రమాదవశాత్తు పడి గల్లంతయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకున్నారు. స్థానికుల సహాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. గల్లంతయిన వ్యక్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉందని అధికారులు పేర్కొన్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.