JGL: పేదలకు గూడు కల్పించాలనే లక్ష్యంతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం పేదలకు ఒక వరమని ఏఎంసీ ఛైర్మన్ రాములు గౌడ్ అన్నారు. శనివారం పెగడపల్లి మండలంలోని నంచర్ల గ్రామంలో లావణ్య-తిరుపతి దంపతుల ఇందిమ్మ ఇల్లును సర్పంచ్ వనజతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ శ్యామ్ సుందర్ రెడ్డి, పంచాయతీ కార్యదర్శి వార్డు సభ్యులు పాల్గొన్నారు.
NRML: కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలకు ఆకర్షితులయ్యే పలువురు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు పటేల్ అన్నారు. ఖానాపూర్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో లీగల్ సెల్ నాయకుడు మట్టేరి రాజశేఖర్, న్యాయవాది షేక్ ఖదీర్ కాంగ్రెస్ పార్టీలో చేరగా వారికి ఎమ్మెల్యే పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు.
NLG: నల్గొండ సెట్విన్ కేంద్రంలో కుట్టు మిషన్ శిక్షణ పూర్తి చేసుకున్న మైనార్టీ మహిళలకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి శనివారం సర్టిఫికెట్లు, కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. సెట్విన్ను రాష్ట్రంలోనే ఉత్తమ కేంద్రంగా తీర్చిదిద్దుతామని, మహిళల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మేయర్ చైతన్య, కలెక్టర్ చంద్రశేఖర్ పాల్గొన్నారు.
MNCL: మంచిర్యాల జిల్లాలో పదో తరగతి వార్షిక పరీక్షలు మొదటి రోజైనా శనివారం ప్రశాంతంగా జరిగాయి. జిల్లా వ్యాప్తంగా 48 పరీక్షా కేంద్రాల్లో 9689 మంది విద్యార్థులకు గాను 9660 మంది హాజరు కాగా.. 29 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. జిల్లా కేంద్రంలోని ఆర్బీహెచ్వీ పాఠశాలలో పరీక్షా కేంద్రాన్ని కలెక్టర్ కుమార్ దీపక్ సందర్శించారు.
MLG: ‘బుల్లెట్ నుంచి బ్యాలెట్’ వరకు సాగిన తన జీవిత ప్రయాణం ప్రజాస్వామ్య శక్తిని ప్రతిబింబిస్తుందని మంత్రి సీతక్క తెలిపారు. న్యూఢిల్లీలో నిర్వహించిన ‘షీ స్పార్క్స్-2026’ కార్యక్రమంలో మంత్రి పాల్గొని మాట్లాడారు. ఒకప్పుడు న్యాయస్థానంలో నిందితురాలిగా నిలిచిన తాను, కాలక్రమంలో అదే కోర్టులో న్యాయవాదిగా వాదనలు వినిపించిన సందర్భం తన జీవితంలో కీలక మలుపన్నారు.
BHNG: భువనగిరి మున్సిపాలిటీ 25వ, వార్డులో ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, సీసీ రోడ్డు పనులకు ఇవాళ శంకుస్థాపన చేశారు. రూ.23 లక్షలతో మున్సిపల్ ఛైర్మన్ తంగలపల్లి శ్రీవాణి రవికుమార్, వార్డ్ కౌన్సిలర్ బెండ స్వరూప లాల్ రాజ్ పనులను ప్రారంభించారు. వారు మాట్లాడుతూ.. వార్డు అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.
రాజన్న సిరిసిల్ల జిల్లాలో SSC పబ్లిక్ పరీక్షలు మొదటిరోజున ప్రశాంతంగా జరిగినట్లు జిల్లా విద్యాధికారి జగన్మోహన్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. 34 పరీక్షా కేంద్రాలలో 7307 మంది విద్యార్థులకు గాను 99.89 హాజరు శాతంతో 7299 మంది విద్యార్థులు హాజరయ్యారు. 8 మంది విద్యార్థులు గైర్హాజరు అయినారని తెలిపారు. ఎటువంటి అవాంతరాలు లేకుండా పరీక్ష ప్రశాంతంగా ముగిసిందని డీఈవో తెలిపారు.
MDK: తూప్రాన్ పట్టణ మున్సిపల్ కార్యాలయంలో శనివారం వైద్య శిబిరం నిర్వహించారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో మనోహరాబాద్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టారు. వైద్య శిబిరాన్ని మున్సిపల్ కమిషనర్ పాతూరి గణేష్ రెడ్డి ప్రారంభించగా, మున్సిపల్ పారిశుద్ధ్య సిబ్బందికి వైద్య పరీక్షలు నిర్వహించి మందులను అందజేశారు.
NGKL: కల్వకుర్తి మండలం బెక్కరలోని నర్సరీని సర్పంచ్ దార భీమమ్మ బాలనాగయ్య శనివారం సందర్శించారు. ‘ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక’లో భాగంగా మొక్కల పెంపకంపై ప్రత్యేక దృష్టి సారించాలని పంచాయతీ సిబ్బందిని ఆదేశించారు. నాటిన మొక్కలు ఏపుగా పెరిగేలా సంరక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సెక్రెటరీ నరేందర్, ఫీల్డ్ అసిస్టెంట్ పాల్గొన్నారు.
BHPL: రేగొండ మండల నూతన SIగా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన డి. సుధాకర్ను శనివారం మాజీ MPP పున్నం లక్ష్మీ-రవి, మాజీ MPTC పట్టెం శంకర్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నూతన SIను శాలువతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో రంగయ్యపల్లి గ్రామ శాఖ అధ్యక్షులు బండి శ్రీనివాస్ గౌడ్, దమ్మన్నపేట ఉపసర్పంచ్ జనార్ధన్, నడిపెల్లి చక్రిదర్ రావు, ఎండి షాబిర్ ఉన్నారు.
BDK: పాల్వంచలోని శ్రీనివాస కాలనీకి వెళ్లే రోడ్డుపై నెలలుగా గుంతలు ఉన్నాయి. ప్రతి రోజు ఈ రోడ్డుపై ప్రయాణించే వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. దీనిపై స్థానికులు ఎన్నిసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఎలాంటి చర్యలు కనిపించలేదు. అయితే రేపు మంత్రి తుమ్మల పర్యటన ఉండటంతో గుంతలను అధికారులు పూడ్చడంపై “మా బతుకులు అంత విలువలేనివేనా”..? అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.
SDPT: మల్లన్న సాగర్ కాలువ ద్వారా చింతమడక పెద్ద చెరువుకు నీటిని విడుదల చేయాలని కోరుతూ శనివారం రైతులు సిద్దిపేట-హుస్నాబాద్ రహదారిపై ధర్నా చేపట్టారు. సాగునీరు అందక పంట పొలాలు ఎండిపోతున్నాయని, అధికారులు వెంటనే స్పందించి తమను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రహదారిపై బైఠాయించడంతో వాహనాలు కాసేపు నిలిచిపోయాయి.
WGL: తెలంగాణలో ధాన్యం, పత్తి రవాణాకు అవసరమైన ‘రైల్వే రేక్స్’ను సమృద్ధిగా కేటాయించాలని ఇటీవల ఎంపీ డా.కడియం కావ్య కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు కేంద్ర రైల్వేశాఖ సహాయ మంత్రి రవ్నీత్ సింగ్ ఎంపీ కావ్యకు లేఖ ద్వారా “రైల్వే రేక్స్”ను సమృద్ధిగా కేటాయిస్తామని హామీ ఇచ్చారు. రూల్ 377 కింద 2025 DEC- 9న ఎంపీ కావ్య ఈ అంశాన్ని లోక్ సభలో ప్రస్తావించారు.
వనపర్తి ఎమ్మెల్యే మెఘా రెడ్డి అమ్మపల్లి గ్రామంలోని శ్రీనివాస్ రెడ్డి అంతిమయాత్రలో పాల్గొని పాడే మోశారు. శ్రీనివాస్ రెడ్డి అంత్యక్రియలు ఆయన స్వగ్రామమైన అమ్మపల్లి గ్రామంలో శనివారం జరిగాయి. ఆయన మరణం దిగ్బంధికి గురి చేసింది. అతని జ్ఞాపకాలు సజీవంగా ఉంటాయని ఎమ్మెల్యే అన్నారు. ఆస్తులు కంటే ఆప్తులను సంపాదించుకోవడమే అసలైన జీవితం అని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
MBNR: ఫుట్ పాత్ ఆక్రమణలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించమని కార్పొరేషన్ పరిధిలోని 21వ డివిజన్ కార్పొరేటర్ గుండా సంతోష్ అన్నారు. శనివారం డివిజన్ పరిధిలోని మున్సిపల్ పార్క్ ఎదురుగా ఉన్నటువంటి ఆక్రమణలను ఆయన పరిశీలించారు. ఆక్రమణలు ఇలాగే కొనసాగితే ప్రజలకు ఎంతో ఇబ్బంది అవుతుందని వెల్లడించారు. ఆక్రమణలు చేయకుండా వ్యాపారం చేయాలన్నారు.