SRCL: కవి, రచయిత పెరుక రాజు సాహిత్యంలో చేస్తున్న విశిష్ట కృషికి గాను ప్రతిష్ఠాత్మకమైన “సాహితీ కళా సేవా పురస్కారం2026” కు ఎంపికయ్యారు. తెలుగు భాషతో పాటు సామాజిక చైతన్యంతో కూడిన శక్తివంతమైన కలంతో అన్ని భారతీయ భాషల్లో ఆయన చేస్తున్న అసాధారణ సాహిత్య సేవలకు గుర్తింపుగా ఎంపిక చేసినట్లు సాహితీ కళా సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షురాలు స్వప్న కిషోర్ తెలిపారు.
JN: జిల్లా కేంద్రంలోని పూసల భవనంలో గొర్రెల మేకల పెంపకందారుల సంఘం (GMPS) జిల్లా నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతన జిల్లా గౌరవ అధ్యక్షుడిగా సాదం రమేష్, అధ్యక్షుడిగా దేవేందర్, జిల్లా ఉపాధ్యక్షులుగా జీగారి యాదగిరి, గుండా వెంకటయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శిగా బాలరాజు, జిల్లా సహాయ కార్యదర్శిలుగా ఆవుల ప్రభాకర్, స్వరూపను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
మెదక్ జిల్లా రామాయంపేట మండలం సుతారిపల్లి గ్రామంలో ‘ప్రజాపాలన-ప్రగతి’ కార్యక్రమంలో భాగంగా పిల్లల భద్రత, డ్రగ్స్ నియంత్రణపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్సై బాలరాజ్, గ్రామ సర్పంచ్ సునీల్ పాల్గొని మాట్లాడారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, పిల్లల రక్షణ పట్ల తల్లిదండ్రులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
BHNG: మోత్కూర్లో గ్యాస్ సిలిండర్ కోసం వినియోగదారులు శనివారం ఉదయం నుంచే గ్యాస్ గోదాం వద్ద బారులు తీరారు. ఉదయం 9 గంటల నుంచే భారీ క్యూ లైన్లు కనిపించాయి. గ్యాస్ సరఫరా సక్రమంగా లేకపోవడంతో మహిళలు, వినియోగదారులు గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోందని వాపోతున్నారు. సిలిండర్ కోసం ముందుగానే వచ్చి క్యూలో నిలబడాల్సి వస్తోందని తెలిపారు.
BHNG: మోత్కూర్లో గ్యాస్ సిలిండర్ల కోసం వినియోగదారులు శనివారం ఉదయం నుంచే గ్యాస్ గోదాం వద్ద బారులు తీరారు. ఉదయం 9 గంటల నుంచే భారీ క్యూ లైన్లు కనిపించాయి. గ్యాస్ సరఫరా సక్రమంగా లేకపోవడంతో మహిళలు, వినియోగదారులు గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోందని వాపోతున్నారు. సిలిండర్ల కోసం ముందుగానే వచ్చి క్యూలో నిలబడాల్సి వస్తోందని వారు తెలిపారు.
GDWL: జిల్లాలోని ఎస్సీ నిరుద్యోగ యువత ఆర్థికాభివృద్ధి కోసం 2025-26 ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వం పలు స్వయం ఉపాధి పథకాలను ప్రవేశపెట్టిందని కలెక్టర్ రిజ్వాన్ బాషా తెలిపారు. జిల్లా ఎస్సీ సేవా సహకార అభివృద్ధి సంఘం ఆధ్వర్యంలో ఈ పథకాలు అమలు కానున్నాయి. అర్హులైన యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
MBNR: ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా రాజాపూర్ మండల కేంద్రంలోని నర్సరీని అధికారులు, సర్పంచ్ కావలి రామకృష్ణ శనివారం పరిశీలించారు. మొక్కల పెంపకంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, అవి ఏపుగా పెరిగేలా చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ శాఖ అధికారులు, వార్డు సభ్యులు పాల్గొన్నారు.
NRPT: భారత ప్రభుత్వ టెలికం అడ్వైజరీ కమిటీ సభ్యుడిగా నియమితులైన అడ్వకేట్ పసుల నీరజ్ను శనివారం నర్వ మండలం నాగిరెడ్డిపల్లిలో బీజేపీ నేతలు ఘనంగా సన్మానించారు. ఎంపీ డీకే అరుణ సహకారంతో ఈ పదవి దక్కడంపై హర్షం వ్యక్తం చేస్తూ ఆమెకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో లంకాల డిప్యూటీ సర్పంచ్ విజయ్, వెంకటేశ్వర రెడ్డి, బొజ్జన్న తదితరులు పాల్గొన్నారు.
VKB: కోట్పల్లి మండలంలోని అన్నసాగర్ నుంచి సల్బత్తాపూర్ వెళ్లే రహదారి పూర్తిగా అధ్వానంగా మారింది. రోడ్డుపై మోకాళ్ల లోతు గుంతలు పడటంతో అటుగా వెళ్లే రైతులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షాకాలం వస్తే ఈ మార్గంలో ప్రయాణం ‘కత్తి మీద సామే’ అని గ్రామస్తులు మండిపడుతున్నారు. అధికారులు స్పందించి వెంటనే నూతన రోడ్డు నిర్మించాలని ప్రజలు కోరుతున్నారు.
HYD: నగరంలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి సమక్షంలో RR జిల్లాకు చెందిన 50 మందికి పైగా BRS నాయకులు BJPలోకి చేరారు. వారికి BJP రాష్ట్ర అధ్యక్షులు రాంచందర్ రావు పార్టీ కండువాను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో BRS అస్తిత్వం కోల్పోయిందని, ఆపార్టీకి భవిష్యత్ లేదని గ్రహించే BJPలోకి చేరుతున్నారన్నారు.
KNR: సైదాపూర్ మండలంలోని బొమ్మకల్ గ్రామానికి చెందిన ఏలూరు మధుకర్ రెడ్డి కుమార్తె సంగీత వివాహానికి గ్రామ సర్పంచ్ వేముల శ్రీకాంత్ శనివారం రూ.2,000 వివాహ కానుకను అందజేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు గ్రామంలోని ప్రతి ఆడబిడ్డ పెళ్లికి ఈ ఆర్థిక సాయం అందిస్తున్నట్లు సర్పంచ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు అశోక్, రాజు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
HYD: ఎండకాలం ప్రారంభంలోనే చికెన్ ధరలు కొండెక్కాయి. శనివారం KG చికెన్ రూ. 325 నుంచి 330 వరకు పలకడం గమనార్హం. ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కిలో స్కిన్తో కూడిన చికెన్ ధర రూ. 286గా ఉండగా, స్కిన్లెస్ చికెన్ ధర రూ. 325కు చేరుకుంది. వేసవి మొదలులో ఇలా ఉంటే ఏప్రిల్, మే నెలల్లో ధరలు ఇంకెంత పెరుగుతాయోనని చికెన్ ప్రియులు సందేహ పడుతున్నారు.
ADB: గుడిహత్నూర్ మండలంలోని కోలహరి గ్రామంలో బోథ్ MLA అనిల్ జాదవ్ శనివారం పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలోని సీసీ రోడ్డు, వాకింగ్ ట్రాక్ వంటి పలు అభివృద్ధి పనులకు స్థానిక నాయకులతో కలిసి భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు తనవంతుల కృషి చేస్తానని అనిల్ జాదవ్ పేర్కొన్నారు.
WNP: తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం 4వ రాష్ట్ర మహాసభల సన్నాహక సమావేశానికి జిల్లా నాయకులు శనివారం మహబూబ్ నగర్ తరలివెళ్లారు. అంబేద్కర్ కళాభవన్లో జరిగే ఈ సభలో జిల్లా అధ్యక్షుడు ఎస్.అజయ్, సీపీఎం నేతలు మహమూద్, గోపి, కౌన్సిలర్ మాధవి రాజేందర్ తదితరులు పాల్గొని మహాసభలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.
NZB: కమ్మర్ పల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం 10వ తరగతి పరీక్షలు జరుగుతున్న పరీక్షా కేంద్రాలను ఎంపీడీవో చింతరాజ శ్రీనివాస్ సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని పాఠశాల పరీక్షల పర్యవేక్షణ అధికారితో పాటు పోలీసు అధికారులకు సూచించారు.