HYD: నగరంలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి సమక్షంలో RR జిల్లాకు చెందిన 50 మందికి పైగా BRS నాయకులు BJPలోకి చేరారు. వారికి BJP రాష్ట్ర అధ్యక్షులు రాంచందర్ రావు పార్టీ కండువాను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో BRS అస్తిత్వం కోల్పోయిందని, ఆపార్టీకి భవిష్యత్ లేదని గ్రహించే BJPలోకి చేరుతున్నారన్నారు.