WNP: తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం 4వ రాష్ట్ర మహాసభల సన్నాహక సమావేశానికి జిల్లా నాయకులు శనివారం మహబూబ్ నగర్ తరలివెళ్లారు. అంబేద్కర్ కళాభవన్లో జరిగే ఈ సభలో జిల్లా అధ్యక్షుడు ఎస్.అజయ్, సీపీఎం నేతలు మహమూద్, గోపి, కౌన్సిలర్ మాధవి రాజేందర్ తదితరులు పాల్గొని మహాసభలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.