MNCL: లక్షెటిపేట మున్సిపాలిటీ పరిధిలోని 13వ వార్డులో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామని వార్డు కౌన్సిలర్ బిరుదుల సత్యనారాయణ అన్నారు. మంగళవారం వార్డులోని పలు కాలనీలలో అనే పర్యటించారు. ఈ సందర్భంగా స్తంభాలకు నిరుపయోగంగా వున్న వెలగని దీపాలను మున్సిపాలిటీ సిబ్బందితో తీసివేయించి నూతన విద్యుత్ దీపాలను అమర్చారు. వార్డులో సమస్యలు ఉంటే తనకు తెలపాలన్నారు.
కరీంనగర్ నగర పాలక సంస్థ 14వ డివిజన్ చింతకుంట వాసుల ఏళ్లనాటి కష్టానికి తెరపడింది. శ్మశానవాటిక సమీపంలోని డంప్ యార్డు వల్ల స్థానికులు పడుతున్న ఇబ్బందులను ఎన్నికల సమయంలో కార్పొరేటర్ గడ్డి ప్రదీప్ గుర్తించారు. ఇచ్చిన హామీ మేరకు అధికారులతో కలిసి ఇవాళ పర్యవేక్షించి, యార్డును అక్కడి నుంచి ఇతర ప్రాంతానికి తరలించారు. దీంతో స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.
ADB: అడవుల, వన్యప్రాణుల సంరక్షణ మనందరి బాధ్యత అని ఇచ్చోడ FRO నాగవత్ స్వామి అన్నారు. సిరికొండ మండలంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఆయన మాట్లాడుతు.. అభయారణ్యం విశిష్ఠత గురించి ప్రజలకు, విద్యార్థులకు వివరించారు. అడవులు వన్యప్రాణులు ఉంటేనే మనిషికి భవిష్యత్తు ఉంటుందని FRO నాగవత్ స్వామి వెల్లడించారు. కార్యక్రమంలో FSOలు చంద్రరెడ్డి, తదితరులు ఉన్నారు.
BHNG: తల్లిదండ్రులను కళ్లల్లో పెట్టుకుని చూసుకోవాల్సిన కొడుకులు, ఆస్తి పంచుకుని వారిని నడిరోడ్డుపై వదిలేశారు. ఆలేరు మండలం కొలనుపాకకు చెందిన ధర్మ సోమిరెడ్డి, రమణమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నా, తల్లిదండ్రుల బాగోగులు పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేశారు. గతంలో కౌన్సిలింగ్ ఇచ్చినా మార్పు రాకపోవడంతో, బాధితులు నిన్న ప్రజావాణిలో కలెక్టర్కు మొరపెట్టుకున్నారు.
NGKL: కందనూలు ప్రభుత్వ ఆసుపత్రిలో మార్చి నెల సదరం శిబిరాల తేదీలను డీఆర్డీవో చిన్న ఓబులేసు ప్రకటించారు. శారీరక దివ్యాంగులకు 6, 10, 13, 17, 20, 24, 31 తేదీలో, వినికిడి లోపానికి 5, 25, కంటిచూపు లోపానికి 09, 24, మానసిక వైకల్యానికి 11, 18, తలసేమియా బాధితులకు 30న శిబిరాలు నిర్వహిస్తారు.
SDPT: అక్కన్నపేట (M) కేశవాపూర్లో విషాదం చోటుచేసుకుంది. 14 ఏళ్ల క్రితం ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యంతో తండ్రి మృతి చెందగా నిన్న తల్లి తలపాక కనకవ్వ అనారోగ్యంతో కన్నుమూశారు. దీంతో ఇద్దరు కుమార్తెలు అనాథలుగా మారారు. తల్లి మృతితో అక్కాచెల్లెళ్లు రోదిస్తున్న దృశ్యం గ్రామస్థులను కలచివేసింది. దహన సంస్కారాలకు డబ్బులు లేకపోవడంతో జీపీ పాలకవర్గం, గ్రామస్థులు చందాలు వేసి కార్యక్రమం నిర్వహించారు.
MBNR: జడ్చర్ల మండలం కోడ్గల్ గ్రామానికి చెందిన బాలరాజు గౌడ్ ఇటీవల గ్రామపంచాయతీ ఎన్నికల్లో వార్డు సభ్యుడిగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా బాల్య స్నేహితులు సోమవారం శాలువాతో సన్మానించి అభినందనలు తెలిపారు. రానున్న రోజుల్లో మరిన్ని ఉన్నత పదవులు సాధించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో శివలింగం, ప్రభు శంకర్, రాజు, రాములు, మల్లేష్, గోపాల్ తదితరులు పాల్గొన్నారు.
వనపర్తి జిల్లాలోని 5 పురపాలికల్లో 2025-2026 ఆర్థిక సంవత్సరం కోట్లలో పన్ను వసూలు కావాల్సి ఉంది. ఇప్పటి వరకు లక్ష్యంలో సగం వరకు మాత్రమే సిబ్బంది వసూలు చేయగలిగారు. ఈ నెలాఖరు వరకు వసూళ్లకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు. మొత్తంగా లక్ష్యం చేరుకోవడానికి స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు.
సూర్యాపేట జిల్లా కేంద్రంలోని 27వ వార్డులో హోళీ వేడుకలు అంబరాన్నంటాయి. వార్డు కౌన్సిలర్ లక్ష్మీ కాంతమ్మ స్థానిక ప్రజలతో కలిసి వేడుకల్లో పాల్గొన్నారు. స్వయంగా వార్డు ప్రజల మధ్యకు వచ్చి, అందరికీ రంగులు పూసి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. హోళీ రంగుల పండుగ అని, ఈ రంగుల వలె ప్రజలందరి జీవితాలు సుఖసంతోషాలతో నిండాలని ఆకాంక్షించారు.
MDK: మనోహరాబాద్ మండలం దండుపల్లి వద్ద గల అటవీ శాఖ తూప్రాన్ రేంజ్ కార్యాలయం వద్ద ప్రపంచ వన్య ప్రాణుల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. అటవీ శాఖ తూప్రాన్ రేంజర్ అంబర్ సింగ్ ఆధ్వర్యంలో ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవం చేపట్టారు. రేంజ్ కార్యాలయం వద్ద ప్రపంచ వన్య ప్రాణుల దినోత్సవం బ్యానర్ ప్రదర్శిస్తూ, వన్య ప్రాణుల రక్షణకు పాటు పడతామని పేర్కొన్నారు.
HYD: నగరంలో ప్రజారోగ్యమే లక్ష్యంగా ఆహార భద్రతా అధికారులు తనిఖీలు ముమ్మరం చేశారు. మంగళవారం జీహెచ్ఎంసీ పరిధిలోని అంబర్పేట, చాంద్రాయణగుట్ట, ఖైరతాబాద్, గోషామహల్, అత్తాపూర్ ప్రాంతాల్లోని పలు రెస్టారెంట్లు, ఆహార కేంద్రాలను ఫుడ్ సేఫ్టీ బృందాలు తనిఖీ చేశాయి.
NZB: బోధన్ రూరల్ పోలీస్ స్టేషన్ ఆవరణలో మంగళవారం అధికారులు, సిబ్బంది ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ హోలీ వేడుకలు జరుపుకున్నారు. పండుగ పూట ప్రజలందరూ సురక్షితంగా ఉండాలని నిరంతరం పహారా కాసే పోలీసులు, ఈ సందర్భంగా పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకున్నారు.
NLG: మిర్యాలగూడ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో మంగళవారం హోలీ సంబరాలు ఘనంగా జరిగాయి. ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ శంకర్ నాయక్, రాష్ట్ర నేత స్కైలాబ్ నాయక్లు ప్రజలు, పార్టీ కార్యకర్తలతో రంగులు పూసుకుని వేడుకల్లో పాల్గొన్నారు. ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకుంటూ అందరిలో ఉత్సాహం నింపారు. ఈ వేడుక స్థానిక కాంగ్రెస్ శ్రేణుల్లో కొత్త జోష్ నింపింది.
MBNR: నవాబుపేట మండలం ఎస్సై విక్రం మానవత్వం చాటారు. బంగరంపల్లి గ్రామానికి చెందిన బాలకృష్ణ (70) రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కుమారుడు మానసిక వికలాంగుడు కావడంతో కుటుంబం కష్టాల్లో ఉంది. విషయం తెలుసుకున్న ఎస్సై విక్రం వారి ఇంటికి చేరుకుని ఆర్థిక సహాయం అందించారు. స్థానికులు ఎస్సైను అభినందించారు.
HYD: హోలీ వేడుకల ముసుగులో మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తే కఠిన తీసుకుంటామని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. రంగులు చల్లే నెపంతో వేధింపులకు పాల్పడితే ఉపేక్షించేది లేదని, అటువంటి వారిపై కఠిన కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు. నగరవ్యాప్తంగా షీ-టీమ్స్, గస్తీ బృందాలు నిరంతరం నిఘా ఉంచుతాయని తెలిపారు.