NLG: మిర్యాలగూడ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో మంగళవారం హోలీ సంబరాలు ఘనంగా జరిగాయి. ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ శంకర్ నాయక్, రాష్ట్ర నేత స్కైలాబ్ నాయక్లు ప్రజలు, పార్టీ కార్యకర్తలతో రంగులు పూసుకుని వేడుకల్లో పాల్గొన్నారు. ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకుంటూ అందరిలో ఉత్సాహం నింపారు. ఈ వేడుక స్థానిక కాంగ్రెస్ శ్రేణుల్లో కొత్త జోష్ నింపింది.