HYD: రోడ్డు ప్రమాదాల్లో హెడ్ ఆన్ కొలీజియన్ కేసులే అత్యధిక ప్రాణనష్టానికి కారణంగా అధికారులు వెల్లడించారు. వాహనం, వాహనం ఢీకొన్న సందర్భాలు, వాహనం, పాదచారి ఢీకొన్న ఘటనల్లో సుమారు 80 శాతం వరకు మరణాలు నమోదవుతున్నట్లు HYD ట్రాఫిక్ టీం గుర్తించారు. వేగం, నిర్లక్ష్య డ్రైవింగ్, ట్రాఫిక్ నియమాల ఉల్లంఘనలు ప్రధాన కారణాలుగా పేర్కొన్నారు.
MDK: రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలో వేసవికాలంలో తాగునీటి సమస్య రాకుండా పాలకవర్గం సభ్యులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. మున్సిపాలిటీ పరిధిలోని నాలుగో వార్డ్ బీసీ కాలనీలో మంగళవారం నూతన బోరుబావి తవ్వకం కార్యక్రమం నిర్వహించారు. కౌన్సిలర్ బహిరంగ స్వప్న ఆధ్వర్యంలో బోరుబావి తవ్వకాన్ని ప్రారంభించారు. పుష్కలంగా మీరు రావడంతో సంతోషం వ్యక్తం చేశారు.
SRPT: తిరుమలగిరిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక హెల్త్ మిషన్ 99 రోజుల కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన మెగా హెల్త్ క్యాంపును మంగళవారం మున్సిపల్ చైర్మన్ సంకేపల్లి రఘునందన్ రెడ్డి ప్రారంభించారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో వైద్య శిబిరం ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
HYD: చిన్న వయసులోనే పిల్లల్లో కంటిచూపు తగ్గుతుందని HYD మాజీ ఎంటమాలజీ చీఫ్ డాక్టర్ రాంబాబు తెలిపారు. వివిధ పాఠశాలల్లో పరీక్షలు నిర్వహించిన ఆయన, విటమిన్-A డెఫిషియన్సీ గుర్తించినట్లుగా వివరించారు. అంతేకాక పిల్లలు డిజిటల్ ప్రపంచానికి దూరంగా ఉండటం మంచిదని, విటమిన్-A కోసం క్యారెట్, ఫిష్ తదితర ఆహారంలో భాగం చేసుకోవాలన్నారు.
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో ఏప్రిల్ 5 వ తేదీ ఆదివారం రోజున నిర్వహించనున్న హిందుసమ్మెలన కార్యక్రమంను విజయవంతం చేయాలనీ హుస్నాబాద్ హిందూచైతన్య సమితి సభ్యులు కోరారు. ఈ మేరకు మంగళవారం బుడిగేజంగాల సంఘం, రెడ్డి సంఘం,రజక సంఘం, హమాలీ సంఘం సభ్యులను కలిసి వారికి కరపత్రం అందించి కార్యక్రమానికి ఆహ్వానించారు.
ASF: నిర్మాణాల కోసం ఇసుకను తరలించేవారు ఇకపై పాత పద్ధతిలో కాకుండా, ఆన్లైన్ ద్వారానే అనుమతులు పొందాలని దహెగాం మండల తహశీల్దార్ మునవర్ షరీఫ్ మంగళవారం స్పష్టం చేశారు. ఇళ్లు, ఇతర కట్టడాలకు నిర్ణీత చలానా చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. అనుమతి లేకుండా ఇష్టానుసారంగా ఇసుకను తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
KMM: నేలకొండపల్లి మండల నూతన తహసీల్దార్గా పి. రాంప్రసాద్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా కార్యాలయ సిబ్బంది ఆయనకు పుష్పగుచ్ఛాలు అందించి ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మండల అభివృద్ధికి, ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు తన వంతు కృషి చేస్తానని వెల్లడించారు.
SRCL: చందుర్తి మండలంలోని పలు గ్రామాల్లో అకాల వర్షాలతో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. గ్రామాల్లో ఉదయం నుంచి ఉరుములు మెరుపులతో కురిసిన వర్షానికి మొక్కజొన్న, నువ్వులు, మామిడి కాయలు నేల రాలిపోయాయి. చేతికి వచ్చిన పంట దెబ్బతినడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని రైతన్నలు కోరుతున్నారు.
KNR: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అంగన్వాడీ కేంద్రాల్లోని చిన్నారులకు అల్పాహారం అందించే తొలి ముద్ద పథకం అమలుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఉమ్మడి జిల్లాలోని 2,135 కేంద్రాల్లో ఉన్న 42,600 మంది చిన్నారులకు ఉప్మా, కిచిడీ మిక్స్లను బ్రేక్ ఫాస్ట్ అందించనున్నారు. ఆరేళ్లలోపు పిల్లల్లో పౌష్టికాహార లోపాన్ని నివారించి, మానసిక ఎదుగుదలకు తోడ్పడుతుందని అధికారులు సూచిస్తున్నారు.
MNCL: బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 2026-27 విద్యా సంవత్సరం నుంచి ‘BA ఆనర్స్’ కోర్సు అందుబాటులోకి రానుందని ప్రిన్సిపల్ శంకర్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఇంటర్, పాలిటెక్నిక్ డిప్లొమా పూర్తి చేసిన విద్యార్థులు ఈ కోర్సులో చేరడానికి అర్హులని పేర్కొన్నారు. వినూత్నమైన ఈ డిగ్రీ కోర్సు ద్వారా విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని పేర్కొన్నారు.
ADB: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సోమవారం అర్ధరాత్రి కురిసిన ఈదురుగాళ్లతో కూడిన వర్షానికి అన్నదాతకు తీరని నష్టం వాటిల్లింది. మొక్కజొన్న, జొన్న పంటతోపాటు మామిడి సాగు చేస్తున్న రైతులకు పంట చేతికొచ్చే సమయానికి నేలపాలైంది. అకాల వర్షాలకు పంటలు పూర్తిగా నష్టపోవడంతో క్షేత్రస్థాయిలో అధికారులు సందర్శించి తమను ఆదుకోవాలని అన్నదాతలు కోరుతున్నారు.
MDCL: ఉప్పల్, నాచారం, బోడుప్పల్ ఏరియాలో నిన్నటి వరకు 30 కోడిగుడ్ల ధర రూ.120 నుంచి 130 ఉండగా, నేడు రూ.135 నుంచి రూ.140 వరకు జరిగింది. ఒక్కో ప్రాంతాల్లో ఒక్కో విధంగా విక్రయిస్తున్నారు. చికెన్ ధరలు తగ్గుముఖం పట్టగా కోడిగుడ్ల ధరలు పెరుగుతున్నాయి. కాగా, రేపటి నుంచి చికెన్ దుకాణాలు బంద్ చేస్తామని ఉప్పల్ చికెన్ షాప్ అసోసియేషన్ తెలిపింది.
PDPL: కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన 4 లేబర్ కోడ్స్ ప్రతులను TUCI ఆధ్వర్యంలో జ్యోతినగర్ మేడిపల్లి సెంటర్ వద్ద సోమవారం దగ్ధం చేశారు. TUCI జిల్లా కార్యదర్శి ఈసంపల్లి రాజేందర్ మాట్లాడుతూ.. ఏప్రిల్ 1 నుంచి అమలుకానున్న ఈ కొత్త చట్టాలు కార్మికులకు శాపమని మండిపడ్డారు. పనిగంటల పెరుగుదల, భద్రత కరువుతో కార్మికులు నష్టపోతారన్నారని మండిపడ్డారు.
JGL: జగిత్యాల జిల్లాలో అకాల వర్షాలు, ఈదురు గాలుల కారణంగా మొక్కజొన్న పంట తీవ్రంగా దెబ్బతింది. ధర్మపురి మండలంలో 50 ఎకరాల్లో పంట నేలకొరగగా, జిల్లావ్యాప్తంగా సుమారు వందల ఎకరాలకు నష్టం వాటిల్లినట్లు రైతులు పేర్కొంటున్నారు. పంట చేతికొచ్చే సమయంలో ఈ నష్టం జరగడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఎకరాకు రూ.30 వేల ఖర్చుతో సాగు చేసిన పంటను అకాల వర్షంతో నష్టపోయమన్నారు.
VKB: లక్ష్మీదేవిపల్లి గ్రామ పంచాయతీలో అభివృద్ధి పనులు వేగవంతమయ్యాయి. ఉపాధి హామీ (NREGS) నిధులు 10 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించ తలపెట్టిన CC రోడ్డు పనులను సర్పంచ్ గౌరారం హన్మయ్య మంగళవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ రాధా మల్లేష్, పంచాయతీ కార్యదర్శి వాసు, BRS పార్టీ గ్రామ అధ్యక్షుడు వెంకటయ్య, వార్డు సభ్యులు పాల్గొన్నారు.