GDWL: గద్వాల పట్టణంలోని ఓ ప్రైవేట్ పాఠశాలకు చెందిన 5వ తరగతి విద్యార్థిని మానస, ఇండియన్ నేషనల్ టాలెంట్ సెర్చ్ ఒలింపియాడ్ (INTSO) పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచింది. గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి విద్యార్థినిని ప్రత్యేకంగా అభినందించారు. విద్యార్థులు కష్టపడి చదువుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు.