MDK: రామాయంపేట మండల వ్యాప్తంగా గురువారం నుండి రెండు రోజులపాటు చికెన్ సెంటర్లు మూసివేస్తున్నట్టు చికెన్ సెంటర్ యజమానులు పిలుపునిచ్చారు. కార్పొరేట్ సంస్థలతో తాము ఇబ్బంది పడుతున్నామని, కమిషన్ తగ్గించడంతో అప్పుల పాలవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చిన పిలుపుమేరకు రెండు రోజులపాటు చికెన్ సెంటర్లు మూసివేస్తున్నట్లు వారు ప్రకటించారు.