KMM: రఘునాథపాలెం మండలంలోని పాపటపల్లిలో గ్రామంలో పేకాడుతున్నారన్న సమాచారంతో గురువారం తెల్లవారుజామున పోలీసులు మెరుపు దాడి చేశారు. ఈ ఘటనలో ఐదుగురిని అరెస్టు చేసి వారి వద్ద నుంచి రూ.3 వేల నగదు స్వాధీనం చేసుకున్నట్లు సీఐ ఉస్మాన్ షరీఫ్ తెలిపారు. మండలంలో పేకాట, గంజాయి, డ్రగ్స్ వంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని సిఐ హెచ్చరించారు.