JGL: మత్తు పదార్థాల నిర్మూలనకు సమిష్టి కృషి అవసరమని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ అన్నారు. 99 రోజుల ‘ప్రజా పాలన-ప్రణాళిక’లో భాగంగా ఎమ్మెల్యే సంజయ్ కుమార్తో కలిసి ప్రభుత్వ ఆసుపత్రిలోని డీ-అడిక్షన్ సెంటర్ను సందర్శించారు. డ్రగ్స్ సమస్య సామాజిక, ఆరోగ్య సమస్యగా మారిందని పేర్కొన్నారు. ఎస్పీ మాట్లాడుతూ.. యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని సూచించారు.