MBNR: ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని అలంపురం జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామివారి ఆలయాలను శనివారం పంచాయతీ రాజ్ SE సురేష్ చంద్రా రెడ్డి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. వారికి ఆలయ ప్రధాన అర్చకుడు ఆనంద శర్మ వారికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి, ఉభయ ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేయించారు. తీర్థ ప్రసాదాలు అందజేసి వేద ఆశీర్వచనం చేశారు.