NLG: చింతపల్లి మండలం మదనాపురం(సాగర్ రోడ్డు)లో కొలువైన శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయ బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా సోమవారం నిర్వహించిన రథోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్, కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి ఆశీస్సులు దేవరకొండ నియోజకవర్గ ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు.