KMM: ప్రజలకు పరిశుభ్రతపై మధిర ఛైర్పర్సన్ సామినేని సుజాత అవగాహన కల్పించారు. మధిర మున్సిపాలిటీ పరిధిలోని 9వ వార్డులో శుక్రవారం పారిశుద్ధ్య పనులను ఇవాళ ప్రారంభించారు. వార్డు కౌన్సిలర్ ఎర్రం దాసు చారులత ఆధ్వర్యంలో ఈ ప్రత్యేక డ్రైవ్ చేపట్టారు. కమిషనర్ సంపత్ కుమార్ పర్యవేక్షణలో కాలువల శుభ్రత, చెత్త తొలగింపు పనులు ముమ్మరంగా సాగాయి.