GDWL: వార్డు పరిశుభ్రత పై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించినట్లు గద్వాల మున్సిపాలిటీ 36వ వార్డు కౌన్సిలర్ కమ్మరి సునీత రాము పేర్కొన్నారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా శుక్రవారం వార్డులోని వివిధ కాలనీల్లో మున్సిపల్ సిబ్బందితో డ్రైనేజీలు తొలగించారు. ప్రజలు చెత్తను రోడ్లపై వేయకుండా మున్సిపల్ చెత్త వాహనాల్లో వేసి పరిశుభ్రతకు సహకరించాలన్నారు.