NLG: మార్చి 16 నుంచి జరిగే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో నిరుద్యోగుల పక్షాన నిలబడి ఉద్యోగాల ప్రకటనపై ప్రస్తావించాలని బీసీ JAC ఆధ్వర్యంలో నిరుద్యోగులు స్థానిక ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నిరుద్యోగులను ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీసీ జేఏసీ పట్టణ అధ్యక్షులు బంటు వెంకటేశ్వర్లు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.