JGL: మల్లాపూర్(M) వెంకట్రావుపేట్ శివారులో ఈనెల 20న స్వాధీనం చేసుకున్న ఇసుకకు బహిరంగ వేలం నిర్వహిస్తున్నట్లు తహశీల్దార్ వీర్ సింగ్ తెలిపారు. ఎలాంటి అనుమతి లేకుండా నిల్వఉంచిన 15 ట్రిప్పుల ఇసుక డంపులకు 28వ తేదీ శుక్రవారం ఉ.11 గంటలకు బహిరంగ వేలం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వేలంలో అధికంగా పాటపాడిన వ్యక్తులకు ఇసుక రవాణా చేసుకోడానికి అనుమతి ఇస్తామన్నారు.