MNCL: జన్నారం మండలంలోని ప్రభుత్వ నర్సరీలలో మొక్కలు ఎండిపోకుండా చర్యలు తీసుకుంటున్నామని ఈజీఎస్ ఏపీవో రవీందర్ తెలిపారు. శనివారం జన్నారం మండలంలోని మహమ్మదాబాద్, రోటిగూడాలలో ఉన్న ప్రభుత్వ నర్సరీలను సందర్శించి నిర్వాహకులకు సూచన చేశారు. వేసవి నేపథ్యంలో మొక్కలకు నీరు పోసి కాపాడాలని ఆయన సూచించారు. ఆ గ్రామాల శివారులలోని అటవీ ప్రాంతాలలో ఉపాధి పనులను పరిశీలించారు.