BDK: మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ సచివాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. గడిచిన రెండేళ్లలో సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో పేద ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలను, అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టిందని మంత్రి చెప్పారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను పేదలకు చేర్చాల్సిన బాధ్యత కలెక్టర్లదేనని మంత్రి సూచించారు.