నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం రామన్నపేట్ గ్రామంలో అర్హులైన లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి పథకం చెక్కులను పంపిణీ చేశారు. స్థానిక సర్పంచ్ బేల్దారు నవీన్ లబ్ధిదారులకు ఈ చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ నవీన్తో పాటు జీపీవో సుధాకర్, పంచాయతీ సెక్రెటరీ రమేష్, వార్డు మెంబర్ గోవర్ధన్ పాల్గొన్నారు.