BHPL: గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన నివాస సౌకర్యాలు, చిన్నారుల సంరక్షణ, పోషణ కోసం ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని MLA గండ్ర సత్యనారాయణ రావు తెలిపారు. ఘనపూర్ మండలం మైలారం గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు, అంగన్వాడీ భవనాన్ని ఆదివారం ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. కార్యక్రమంలో PR ఈఈ వెంకటేశ్వర్లు, సర్పంచ్ సమ్మయ్య తదితరులు ఉన్నారు.