SRPT: గ్యాస్ సిలిండర్ బుకింగ్ పేరుతో జరిగే సైబర్ మోసాల పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని జిల్లా ఎస్పీ నరసింహ హెచ్చరించారు. కేవైసీ అప్డేట్, సబ్సిడీ పేరుతో వచ్చే నకిలీ లింకులు క్లిక్ చేయవద్దని, తెలియని వ్యక్తులతో ఓటీపీలు పంచుకోవద్దని సూచించారు. బుకింగ్ కోసం అధికారిక యాప్లు మాత్రమే వాడాలన్నారు. ఎవరైనా మోసపోతే వెంటనే 1930 నంబర్కు ఫిర్యాదు చేయాలని కోరారు.