SRD: మల్లన్న స్వామి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని కోరుకున్నట్లు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. పటాన్చెరు మండల పరిధిలోని భానూరు గ్రామంలో ఆదివారం నిర్వహించిన శ్రీశ్రీశ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవం, జాతర కార్యక్రమంలో ఎమ్మెల్యే జీఎంఆర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.