మైదుకూరు మున్సిపాలిటీగా ఏర్పడి 13 ఏళ్లు గడిచినా అభివృద్ధి కుంటుపడిందని, పన్నులు పెరిగాయే తప్ప రోడ్లు, డ్రైనేజీ, వీధిలైట్లు, దోమల బెడద వంటి సమస్యలు తీరలేదని రైతు సేవాసమితి అధ్యక్షుడు ఏవి. రమణ విమర్శించారు. మున్సిపల్ ఆఫీస్ వద్ద నిరసన తెలిపిన ఆయన, స్పెషల్ ఆఫీసర్ల పాలనలోనైనా కనీస సౌకర్యాలు మెరుగుపరచకపోతే ప్రజలతో కలిసి కార్యాలయాన్ని ముట్టడిస్తామన్నారు.