PDPL: తెలుగు నూతన సంవత్సరం ఉగాది వేడుకలకు పలు ఆలయాలు ముస్తాబవుతున్నాయి. కాల్వ శ్రీరాంపూర్ మండలం తారుపల్లి సహా పలు గ్రామాల్లోని ఆలయాలు సర్వాంగ సుందరంగా మారుతున్నాయి. పోచమ్మ గుడిలో భక్తులకు తాగునీరు, సౌకర్యాల ఏర్పాట్లు చేశారు. పాలకవర్గాల తొలి ఉగాది కావడంతో ప్రత్యేక శ్రద్ధను చూపుతున్నారు. ఈ మేరకు ఆలయాల్లో అధికారులు అవసరమైన సౌకర్యాలను కల్పిస్తున్నారు.