MDK: తూప్రాన్ మున్సిపల్ పరిధిలో 2026- 27 సంవత్సరానికి గాను తై బజార్ వేలం పాటలు బుధవారం ఉదయం 11 గంటలకు కార్యాలయంలో నిర్వహించనున్నట్లు కమిషనర్ పాతూరి గణేష్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. వేలం పాటలలో పాల్గొనే వ్యక్తులు ఆస్తి పన్ను చెల్లించి ఉండాలని, తై బజార్ వేలం పాటలకు రూ. లక్ష ధరావత్, పశువుల సంత వేలం పాటలకు రూ. 50 వేలు ధరావత్ చెల్లించాలని సూచించారు.