ASF: ఆసిఫాబాద్ నియోజకవర్గంలోని రైతుల విజ్ఞప్తి మేరకు CCI ద్వారా పత్తి కొనుగోలు గడువును మార్చి 20 వరకు పొడిగించాలని కాంగ్రెస్ నియోజకవర్గ ఇంఛార్జి అజ్మీరా శ్యామ్ నాయక్ కోరారు. ఈ మేరకు శుక్రవారం మార్కెట్ కమిటీ ఛైర్మన్ మంగతో కలిసి కలెక్టర్ కె. హరితని కలిసి విజ్ఞప్తి చేశారు. రైతుల విజ్ఞప్తిపై జిల్లా కలెక్టర్ సానుకూలంగా స్పందించారని శ్యామ్ నాయక్ తెలిపారు.