SRPT: హుజూర్ నగర్ పట్టణంలోని స్థానిక టీచర్స్ కాలనీలోని శ్రీ జ్ఞాన సరస్వతి దేవాలయ ప్రాంగణంలో నూతన నిర్మాణ పనులకు శుక్రవారం ఘనంగా శంకుస్థాపన జరిగింది. అర్చకుల నివాస గదులు, నిత్య హోమాలు, అక్షరాభ్యాసాల కోసం నిర్మించనున్న ప్రత్యేక మండపానికి మున్సిపల్ ఛైర్మన్ శ్రీనివాస్ గౌడ్, వైస్ ఛైర్మన్ మల్లికార్జున రావు కలిసి భూమి పూజ నిర్వహించారు.