SRPT: అనంతగిరి మండలం అమీనాబాద్ గ్రామానికి చెందిన ప్రముఖ జర్నలిస్ట్ గొల్ల నరేష్ అనారోగ్యంతో మంగళవారం మృతి చెందారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స పొందుతున్న ఆయన పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల స్థానికంగా విషాదం నెలకొంది. పలువురు జర్నలిస్టు సంఘాల నాయకులు, ప్రజాప్రతినిధులు, సామాజిక కార్యకర్తలు సంతాపం వ్యక్తం చేశారు.