NLG: రాష్ట్రంలో ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక కార్యక్రమం ఈ నెల 6వ తేదీ నుంచి జూన్ 12వ తేదీ వరకు నిర్వహించనుంది. ఈ నేపథ్యంలో, హైదరాబాద్లోని సచివాలయంలో మంగళవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివిధ జిల్లాల కలెక్టర్లతో సమావేశమయ్యారు. ఈ సదస్సులో నల్లగొండ కలెక్టర్ బి. చంద్రశేఖర్ కూడా పాల్గొన్నారు.