HYD: నగరంలో మరో రెండు చెరువులు ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి. పాతబస్తీలోని బమృకున్-ఉద్-దౌలా, కూకట్పల్లిలోని నల్ల చెరువు ప్రారంభానికి సిద్ధమయ్యాయి. ఈ నెల 6న బమృకున్-ఉద్-దౌలా చెరువును సీఎం రేవంత్రెడ్డి ప్రారంభించనున్నారు. హైడ్రా మొదట విడత చేపట్టిన 6 చెరువుల్లో ఇప్పటికే అంబర్పేటలోని బతుకమ్మ కుంట గతేడాది సెప్టెంబరు 28న ప్రారంభమైన విషయం తెలిసిందే.