JN: లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని జనగామ డీసీసీ అధ్యక్షురాలు లకావత్ ధన్వంతి లక్ష్మీనారాయణ కలిశారు. జిల్లాలో పార్టీని మరింత బలోపేతం చేయడానికి కృషి చేయాలని, అన్ని వర్గాల నాయకులు, కార్యకర్తలను కలుపుకొని ఏకతాటిపైకి తీసుకువచ్చి క్షేత్ర స్థాయిలో చురుకుగా పనిచేయాలని రాహుల్ గాంధీ సూచించినట్లు జిల్లా అధ్యక్షురాలు తెలిపారు.