BDK: ఎక్కడైనా పులి పాదముద్రలు కనిపిస్తే అటవీ అధికారులకు సమాచారం అందించాలని డీఎఫ్ఓ కృష్ణ గౌడ్ కోరారు. జిల్లా అటవీ ప్రాంతంలోకి పులి ప్రవేశించినట్లు ధ్రువీకరించారు. గతంలో సంచరించిన పులి కాకుండా, ఇది కొత్తదని గుర్తించినట్లు ఆయన నేడు తెలిపారు. ఈ నేపథ్యంలో పశువుల కాపర్లు, రైతులు అటవీ ప్రాంతంలోకి ఒంటరిగా వెళ్లవద్దని, గుంపులుగా వెళ్లాలని సూచించారు.