NRPT: దామరగిద్ద మండలంలోని కానుకుర్తి గ్రంథాలయానికి శాశ్వత భవనం మంజూరు చేయాలని సర్పంచ్ ఎన్. నారాయణ ఆధ్వర్యంలో జిల్లా గ్రంథాలయ ఛైర్మన్ వార్ల విజయ్కుమార్ను కోస్గిలో కలిసి వినతిపత్రం అందించారు. దీనిపై స్పందించిన ఛైర్మన్ ఈ అంశాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి మంజూరుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ నాయకులు, యువకులు పాల్గొన్నారు.