SRD: నాగులపల్లిలో బీజేపీ నిర్వహించిన పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహాభియాన్-2026 శిబిరంలో ఎమ్మెల్సీ డా. చిన్నమైల్ అంజిరెడ్డి పాల్గొన్నారు. పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, కార్యకర్తలు క్రమశిక్షణతో ప్రజాసేవలో నిమగ్నం కావాలని సూచించారు. ప్రధాని మోదీ నాయకత్వంలో బీజేపీ ప్రపంచంలో అతిపెద్ద పార్టీగా ఎదుగుతోందని పేర్కొన్నారు.