NLG: నకరికల్లు మండలం గొల్లగూడెం గ్రామ శివారులో రెవెన్యూ పరిధిలోని ప్రభుత్వ భూమి నుంచి టిప్పర్లతో కాంట్రాక్టర్లు అక్రమంగా మట్టి తరలిస్తున్నారు. అక్రమంగా తవ్వకాలు చేయడంతో భూగర్భ జలాలు దెబ్బతిని నష్టపోతామని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు తక్షణమే చర్యలు తీసుకుని మట్టి తవ్వకాలు జరపకుండా ఆపాలని కోరుతున్నారు.