NZB: రెంజల్ మండలం పేపర్ మిల్ గ్రామంలో శనివారం తహసీల్దార్ శ్రావణ్ కుమార్ అక్రమ ఇసుక డంపులను సీజ్ చేశారు. అనుమతి లేకుండా నిల్వ ఉంచిన 26 ట్రాక్టర్ల ఇసుకను స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో తనను అడ్డుకున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, అక్రమ రవాణా చేసేవారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని ఆయన హెచ్చరించారు.