MHBD: తొర్రూరు మండలంలోని కంటాయపాలెం జడ్పీ ఉన్నత పాఠశాలలో ఆరవ తరగతి చదువుతున్న విద్యార్థిని అనుష్క తన అత్యుత్తమ ప్రదర్శనతో రాష్ట్రస్థాయి ఖోఖో పోటీలకు ఎంపికైనట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు ప్రభాకర్ తెలిపారు. గ్రామీణ ప్రాంత విద్యార్థిని క్రీడల్లో రాణించి రాష్ట్రస్థాయికి ఎంపిక కావడం పట్ల ఉపాధ్యాయులు, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.