RR: రాజేంద్రనగర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో జరిగిన వీసీల ఆత్మీయ సమ్మేళనానికి ఎమ్మెల్యే టీ.ప్రకాష్ గౌడ్ హాజరై వారిని సన్మానించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఇలాంటి కార్యక్రమాలు యూనివర్సిటీలో చేయడం మొదటి సారి అని, 3 యూనివర్సిటీల ఉపకులపతులు ఓకే వేదికపై వచ్చి యూనివర్సిటీల సమస్యలపై వాటి పురోగతికి కృషి చేయడానికి, ఈ వేదిక పునాది అవుతుందన్నారు.