KNR: గన్నేరువరం మండలం పరిధిలోని పీచుపల్లి గ్రామ అభివృద్ధి కోసం రూ. 10 లక్షల నిధులను చెక్ రూపంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ సర్పంచ్ రాజిరెడ్డికి అందజేశారు. ఈ సందర్భంగా కొండాపూర్ సర్పంచ్ సొల్లు అజయ్ వర్మ, బీజేపీ మండల అధ్యక్షుడు నికేష్, మానస దేవి గుడి ఛైర్మన్ చంద్రారెడ్డి, కొంకటి గణేష్, దళిత నాయకులు, మండల, జిల్లా నాయకులు పాల్గొన్నారు.