PDPL: గోదావరిఖనిలోని జీఎం కాలనీకి చెందిన భార్గవ్ (27) సింగరేణి కార్మికుడు అప్పులు, ఆర్థిక ఇబ్బందులతో ఉరి వేసుకుని మంగళవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సింగరేణి సంస్థలో పనిచేస్తున్న భార్గవ్ గత కొంతకాలంగా విధులకు హాజరు కాకపోవడంతో డిస్మిస్ అయ్యాడు. మద్యానికి బానిసై అప్పు చేసి, వీటిని తీర్చలేక మానసిక ఆవేదనకు గురయ్యాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.